ఎ.కొండూరు, : చౌకబియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు తార్కాణం ఈ ఉదంతం. ఎన్టీఆర్ జిల్లా ఎ. కొండూరు మండలం గోపాలపురం వద్ద ఇరువర్గాల వారు పరస్పరం కార్లతో ఢీకొట్టుకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు. తిరువూరు నియోజకవర్గంలో వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి రాజుపేటలోని రైస్ మిల్లు కేంద్రంగా కాకినాడ పోర్టుకు ప్రతినెలా పదుల సంఖ్యలో రేషన్బియ్యం లారీలను తరలించి రూ.కోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వం మారాక అతని వ్యాపారానికి అడ్డుకట్ట పడింది. ఆ దందాను మరో మాఫియా నిర్వాహకుడు చేజిక్కించుకున్నాడు. వీరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఆదివారం గోపాలపురం నుంచి చౌక బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధంకాగా, మరోవర్గం వారు యూటు ఛానళ్ల విలేకరులతో కలిసి అడ్డుకునేందుకు
ప్రయత్నించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న లారీకి కారు అడ్డుపెట్టడంతో ఆగ్రహించిన ప్రస్తుత మాఫియాలోని వ్యక్తులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారు. లారీకి అడ్డుగా ఉన్న కారును మరో కారుతో ఢీకొట్టారు. దీంతో ఆ కారు రహదారి పక్కనున్న కాల్వలోకి పల్టీ కొట్టింది.
ఒకటి పట్టుకోబోతే, మరోటి దొరికింది
ఈ ఘర్షణ జరుగుతుండగానే బియ్యం లారీని అక్కడి నుంచి పంపించగా, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద అధికారుల తనిఖీలో దొరికింది. గోపాలపురానికి ఆలస్యంగా చేరుకున్న పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులకు మరో విచిత్ర అనుభవం ఎదురైంది. ఇక్కడి నుంచి బియ్యం తరలిస్తున్న లారీకి బదులు, గుంటూరు నుంచి ఛత్తీస్ గడక్కు చౌకబియ్యం తరలిస్తూ పోలిశెట్టిపాడు సమీపంలోని పెట్రోల్ బంకులో నిలిపి ఉన్న లారీ పట్టుబడింది. దీనిపై డిప్యూటీ తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా తాము ఘటనా స్థలానికి చేరుకోకముందే గొడవ జరిగిందని తెలిపారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





