* చిత్తూరు జిల్లా వి. కోటలో విషాదం..
* పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు మృతి..
* గుండెపోటుతో ప్రాణాలు విడిచిన వరుడు
AP Crime: కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. అప్పగింతలు కూడా పూర్తయ్యాయో లేదో.. అప్పుడే ఆ నవ వధువు కలలు కల్లలయ్యాయి. ఏడు అడుగులు వేసి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను దురదృష్టం వెంటాడింది. పెళ్లైన ఐదు రోజులకే వరుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలోచోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వి. కోట పట్టణలో పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని వెంగసంద్రాకు చెందిన 28 ఏళ్ల కార్తీక్ అనే యువకుడికి ఇటీవలే పెళ్లయ్యింది. రామకుప్పం మండలం కొల్లుపల్లికి చెందిన భవాని అనే యువతితో ఐదు రోజుల కిందట పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తంతు పూర్తయిన తర్వాత బంధువులు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పగింతల కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక దాంపత్య జీవితం సంతోషంగా సాగిద్దామని ఆ కొత్త జంట భావిస్తున్న సమయంలో దురదృష్టం వెంటాడింది. శుక్రవారం ఐదవరోజు కార్తీక్ అత్తగారింటికి వచ్చాడు. అయితే అనారోగ్యంగా ఉందంటూ భార్యను తీసుకుని ప్రైవేట్ క్లినిక్కు వెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే గుండెపోటుతో చనిపోయాడని కొంతమంది చెప్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కార్తీక్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అతనికి కేవలం గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడ్డారని కాని వైద్యలు సరైనా వైద్యం అందించలేదంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





