ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు జ్యువెలరీ షాప్ను దోచుకెళ్లారు. కారులో వచ్చిన వీరు షాపులోని వారిపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో షాపు యజమాని మరణించగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి..
జైపూర్, ఆగస్టు 25: ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు జ్యువెలరీ షాప్ను దోచుకెళ్లారు. కారులో వచ్చిన వీరు షాపులోని వారిపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో షాపు యజమాని మరణించగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజస్థాన్లోని భివాడిలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
ఆగస్టు 23న సాయంత్రం ఏడు గంటల సమయంలో ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు కారులో భివాడి సెంట్రల్ మార్కెట్ వద్ద ఉన్న కమలేష్ జ్యువెలర్స్ షాపులో చొరబడ్డారు. షాపు బయట ఉన్న సెక్యూరిటీ గార్డును కర్రతో చావగొట్టి, అతని వద్ద ఉన్న గన్ను లాక్కున్నారు. అనంతరం నగల దుకాణంలో ప్రవేశించి లోపల ఉన్న సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన యజమాని కమలేష్ సోనీని తీవ్రంగా కొట్టారు. అతడి కుమారుడు వైభవ్, షోరూమ్ సిబ్బందిని కొట్టి బంధించారు. ఈ ఘటనలో సెక్యురిటీ గార్డుతో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం దుండగులు తమ వెంట తెచ్చిన రెండు బ్యాగుల్లో లక్షల విలువైన బంగారం, వెండి నగలను దోచుకున్నారు. దోపిడీ తర్వాత నిందితులు అక్కడి నుండి పారిపోయారు
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




