దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూలో గత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలిచిన దివ్వెల మాధురి ఆతహత్యాయత్నం చేశారు. కారుతో హైవేపై వెళ్తూ.. ఆమె ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. కారు బోల్తా పడటంతో మాధురికి తీవ్రగాయాలయ్యాయి.
దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు.. మాధురి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆగి ఉన్న కారును మాధురి తన కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా.. లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆమెను పలాస గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో మాధురి ఒక్కరు మాత్రమే ఉన్నారు. అయితే దువ్వాడ వాణి ఆరోపణలు, సోషల్ మీడియా ట్రోల్స్ భరించలేక తాను సూసైడ్ చేసుకోవాలని కారును ఢీ కొట్టినట్లు మాధురి చెప్తుంది. తనకు ఎలాంటి చికిత్స వద్దని ఆమె ఆస్పత్రిలో మొండికేసింది. తన పిల్లలపై చేసిన ఆరోపణలకు పోలీసులు దువ్వాడ వాణిని అరెస్ట్ చేయకపోతే.. తాను మళ్లీ వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని ఆమె చెబుతోంది
Also read
- BRS : యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ నేత.. చితక్కొట్టిన భార్య
- TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”