October 17, 2024
SGSTV NEWS
CrimeNational

రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు.. వారి బ్యాగులు చెక్ చేయగా ఒళ్లు గగుర్పొడిచే సీన్..

వారి బ్యాగులు, వారి ప్రవర్తన పట్ల భద్రతా దళాలకు అనుమానం వచ్చింది. ఇద్దరినీ విచారించగా, ఇద్దరూ మాట్లాడలేరు, వినలేరు, కేవలం సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. అనుమానంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారి బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో కనిపించిన దృశ్యం అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు సైతం అది చూసి కంగుతిన్నారు.  రైల్వే పోలీసులతో పాటు, స్టేషన్‌లోని ప్రయాణికులు అంతా నివ్వేరపోయారు.


ఇద్దరు యువకులు చేతిలో పెద్ద ట్రాలీ బ్యాగ్‌తో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అతను టుటారి ఎక్స్‌ప్రెస్‌ పట్టుకోవలసి ఉంది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మౌనంగా నడుస్తున్నారు. అప్పుడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వారిని గమనించింది. సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఏం అడిగినా విచిత్రంగా సమాధానమిస్తున్నారు.. కేవలం సైగల ద్వారానే మాట్లాడటం కొనసాగించారు. వారి బ్యాగులు, వారి ప్రవర్తన పట్ల భద్రతా దళాలకు అనుమానం వచ్చింది. ఇద్దరినీ విచారించగా, ఇద్దరూ మాట్లాడలేరు, వినలేరు, కేవలం సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. అనుమానంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారి బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో కనిపించిన దృశ్యం అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు సైతం అది చూసి కంగుతిన్నారు.  రైల్వే పోలీసులతో పాటు, స్టేషన్‌లోని ప్రయాణికులు అంతా నివ్వేరపోయారు. మహరాష్ట్రలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్‌ వచ్చేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…


మహారాష్ట్రలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఆగస్టు 5 సోమవారం రోజున ఈ సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌లో బ్యాగ్‌లో ఉన్న మృతదేహాన్ని ఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది దాదర్ రైల్వే స్టేషన్‌లో పెట్రోలింగ్‌లో ఉండగా వారి కళ్ళు ఒక వ్యక్తి తీసుకువెళుతున్న ట్రావెల్ బ్యాగ్‌పై పడ్డాయి. ఆ వ్యక్తి చర్యలపై అనుమానం రావడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని ఆపి బ్యాగ్‌ని సోదా చేశారు. ట్రావెల్ బ్యాగ్ తెరవగానే.. ఆర్పీఎఫ్ జవాన్లు షాక్ తిన్నారు. సైనికులు బ్యాగ్‌ని తెరిచి చూడగా అందులో రక్తంతో తడిసిన మృతదేహం కనిపించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు చేయగా.. మృతదేహం అర్షద్ అలీ అనే వ్యక్తిది అని తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రావెల్ బ్యాగ్‌ని తీసుకువెళుతున్న వ్యక్తిని జై ప్రవీణ్ చావ్డా, అతని సహచరుడు శివజిత్ సురేంద్ర సింగ్‌గా గుర్తించారు. మృతుడు, నిందితులు ఇద్దరూ వినలేరు, మాట్లాడలేరు అని తెలిసింది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు సంకేత భాషా నిపుణుడిని పిలిపించి.. అప్పుడే హత్యకు గల కారణం తెలిసింది.

Also read

Related posts

Share via