పల్నాడు జిల్లా (నరసరావుపేట) : వసతిగృహంలో 9వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జరిగింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం హార్డ్ హైస్కూల్ లో చదువుతున్న రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన 9 వ తరగతి విద్యార్థిని పల్లపు జయలక్ష్మి (14) వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2వ పట్టణ పోలీసులు వసతి గృహానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు పెదయలమంద, సుబ్బమ్మల ఫిర్యాదు మేరకు నరసరావుపేట రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





