July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు



శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ప్రధాన అనుచరుడైన నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via