విజయవాడలో పర్యటించిన జగన్ సింగ్ నగర్ లో వరద బాధితులకు పరామర్శ సాయం అందలేదా? అంటూ వాకబు చేసిన వైసీపీ అధినేత మెడ వరకు నీళ్లున్నప్పటికీ, కొంతమందికి ఇచ్చారని వెల్లడించిన ఓ యువతి
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సాయం అందలేదని ధ్వజమెత్తారు.
కాగా, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో, ఓ యువతి నిర్మొహమాటంగా సమాధానం చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…”మీకు ప్రభుత్వ సాయం అందిందా… ఇంకా అందలేదా?” అని జగన్ ఓ మహిళను అడగ్గా… పక్కనే ఉన్న యువతి స్పందిస్తూ… “నీళ్లు మెడ వరకు ఉన్నాయి… పాపం, వాళ్లయినా ఎలా ఇస్తారు? అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు” అని స్పష్టం చేసింది.
తాజా వార్తలు చదవండి
- నేటి జాతకములు..17 అక్టోబర్, 2024
- Nandivardhanam: ఈ నందివర్థనం పూలతో ఉండే బెనిఫిట్స్ ఊహించనవి.. షాక్ అవ్వక తప్పదు..
- 16వ శతాబ్దం నాటిఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్
- ఆశ్వీయుజ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి…..!(17.10.24)
- Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..