విజయవాడలో పర్యటించిన జగన్ సింగ్ నగర్ లో వరద బాధితులకు పరామర్శ సాయం అందలేదా? అంటూ వాకబు చేసిన వైసీపీ అధినేత మెడ వరకు నీళ్లున్నప్పటికీ, కొంతమందికి ఇచ్చారని వెల్లడించిన ఓ యువతి
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సాయం అందలేదని ధ్వజమెత్తారు.
కాగా, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో, ఓ యువతి నిర్మొహమాటంగా సమాధానం చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…”మీకు ప్రభుత్వ సాయం అందిందా… ఇంకా అందలేదా?” అని జగన్ ఓ మహిళను అడగ్గా… పక్కనే ఉన్న యువతి స్పందిస్తూ… “నీళ్లు మెడ వరకు ఉన్నాయి… పాపం, వాళ్లయినా ఎలా ఇస్తారు? అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు” అని స్పష్టం చేసింది.
తాజా వార్తలు చదవండి
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!