పరిగి (శ్రీసత్యసాయిజిల్లా) : ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలయ్యాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన జయచంద్ర (24) డిగ్రీ పూర్తి చేశాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన ఆయన తాను చేస్తున్న పాల వ్యాపారం, ఇటుక బట్టి నిర్వహణ ద్వారా వస్తున్న డబ్బులను సైతం బెట్టింగ్ కాసి నష్టపోయాడు. దాదాపు రూ.1.50 లక్షల అప్పులు కూడా చేశాడు. ఈ విషయం తెలిసిన జయచంద్ర తండ్రి ఆదినారాయణ అప్పులను తాను తీర్చేస్తానని, ఇకపై బెట్టింగ్ల జోలికి వెళ్లవద్దని, బెంగళూరులో ఉద్యోగం చేసుకోవాలని చెప్పారు. బెంగళూరుకు వెళ్తున్నట్టు జయచంద్ర చెప్పి ఈ నెల 17న ఇంటి నుంచి బయలుదేరాడు. శనివారం రాత్రి హిందూపురం గుడ్డం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జయచంద్ర తన టీ షర్ట్పై ‘ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లకండి.. జీవితం నాశనం చేసుకోకండి’ అంటూ పెన్నుతో రాసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Also read
- Vizianagaram Case: విజయనగరం టెర్రర్ కేసులో మరిన్ని సంచలనాలు
- Hijras : రైల్లో రెచ్చిపోయిన హిజ్రాలు..రూ. 10 వేలు లాక్కొని పరార్!
- TG Crime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్…! ఉరేసుకుని భార్య…
- మాజీ భర్త కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసిన మాజీ భార్య.. ఎందుకో తెలుసా?
- Vizag: కత్తులతో కాదూ కంటిచూపుతో చోరీలు.. 79 కేసుల్లో నిందితుడు