పరిగి (శ్రీసత్యసాయిజిల్లా) : ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలయ్యాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన జయచంద్ర (24) డిగ్రీ పూర్తి చేశాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన ఆయన తాను చేస్తున్న పాల వ్యాపారం, ఇటుక బట్టి నిర్వహణ ద్వారా వస్తున్న డబ్బులను సైతం బెట్టింగ్ కాసి నష్టపోయాడు. దాదాపు రూ.1.50 లక్షల అప్పులు కూడా చేశాడు. ఈ విషయం తెలిసిన జయచంద్ర తండ్రి ఆదినారాయణ అప్పులను తాను తీర్చేస్తానని, ఇకపై బెట్టింగ్ల జోలికి వెళ్లవద్దని, బెంగళూరులో ఉద్యోగం చేసుకోవాలని చెప్పారు. బెంగళూరుకు వెళ్తున్నట్టు జయచంద్ర చెప్పి ఈ నెల 17న ఇంటి నుంచి బయలుదేరాడు. శనివారం రాత్రి హిందూపురం గుడ్డం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జయచంద్ర తన టీ షర్ట్పై ‘ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లకండి.. జీవితం నాశనం చేసుకోకండి’ అంటూ పెన్నుతో రాసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





