యశవంతపుర: బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసిన కామాంధునికి మంగళూరు అడిషనల్ జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధించింది. గతేడాది మార్చి 10న రాత్రి బాలిక ఇంటిలో స్నానం చేస్తుండగా గగన్ అనే యువకుడు ఫోన్తో వీడియో తీశాడు.
బాలిక తల్లిదండ్రులు అతనిపై మంగళూరు జజ్పె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి వినయ్ దేవరాజ్ ఈ మేరకు తీర్పునిచ్చారు. జరిమానా కట్టలేని స్థితి ఉంటే మరో మూడు నెలలపాటు శిక్షను అనుభవించాలని ఆదేశించారు. బాధిత బాలికకు ప్రభుత్వం నుంచి రూ. లక్ష పరిహారంగా అందించాలని అధికారులకు సూచించారు.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





