యశవంతపుర: బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసిన కామాంధునికి మంగళూరు అడిషనల్ జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధించింది. గతేడాది మార్చి 10న రాత్రి బాలిక ఇంటిలో స్నానం చేస్తుండగా గగన్ అనే యువకుడు ఫోన్తో వీడియో తీశాడు.
బాలిక తల్లిదండ్రులు అతనిపై మంగళూరు జజ్పె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి వినయ్ దేవరాజ్ ఈ మేరకు తీర్పునిచ్చారు. జరిమానా కట్టలేని స్థితి ఉంటే మరో మూడు నెలలపాటు శిక్షను అనుభవించాలని ఆదేశించారు. బాధిత బాలికకు ప్రభుత్వం నుంచి రూ. లక్ష పరిహారంగా అందించాలని అధికారులకు సూచించారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





