June 29, 2024
SGSTV NEWS
CrimeNational

మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన వైకాపా ఎంపీ కుమార్తె

ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి అతని మృతికి కారణమైన ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎంపీ బీద మస్తాన్రావు కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై బెసంట్ నగర్ చెందిన సూర్య (22) పెయింటర్.

Also readట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. మాజీ ప్రియురాలిని నడిరోడ్డుపై రాడ్డుతో కొట్టి చంపిన ప్రియుడు! ఫోన్లలో వీడియో తీసిన జనాలు

చెన్నై : ఫుట్ పాత్ మీదనిద్రిస్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి అతని మృతికి కారణమైన ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎంపీ బీద మస్తాన్రావు కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై బెసంట్ నగర్ కు చెందిన సూర్య (22) పెయింటర్. సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో బిసెంట్ నగర్ కళాక్షేత్రకాలనీ వరదరాజసాలైలో ఫుట్ పాత్ మీద నిద్రపోయాడు. ఆ సమయంలో ఓ కారు ఫుట్ పాత్ మీదకి దూసుకొచ్చి సూర్యపై ఎక్కింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతణ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఇద్దరు మహిళలున్నట్లు తెలిసింది. వాహనం నడిపిన మహిళ అక్కడి నుంచి కారుతో పాటు పరారయింది. మరో మహిళ ప్రమాదం గురించి ప్రశ్నించిన ప్రజలతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఇద్దరు మహిళలూ మద్యం మత్తులో ఉన్నట్లు సూర్య బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు, కారు రిజిస్ట్రేషన్ నెంబరు, పారిపోయిన మహిళల ఫొటోలున్నా వారిని అరెస్టు చేయలేదని వారు సోమవారం రాత్రి బెసంట్ నగర్ పోలీసు స్టేషన్ నుముట్టడించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది ఆంధ్రప్రదేశ్ వైకాపాకు చెందిన రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె బీద మాధురిగా గుర్తించారు.ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

Also read :నగరంలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిపై అతికిరాతకంగా దాడి..

Related posts

Share via