మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుండటంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా మూడు హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు పిన్నెల్లి.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అరెస్టుకు భయపడిన పిన్నెల్లి సోదరులు గతంలో పోలీసులు కళ్లు గప్పి పారిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో పహారా కాస్తున్నారు.
Also read
- అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు
- బ్యూటీ పార్లర్ మహిళతో ఎస్ఐ సహజీవనం..!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
- అయ్యో దేవుడా.. అరుణాచలం వెళ్లి.. కారులో వస్తుండగా అర్థరాత్రి ఊహించని ఘటన..
- మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై హత్య.! కట్ చేస్తే.. తెల్లారి చెరువులో డెడ్బాడీగా..





