October 17, 2024
SGSTV NEWS
CrimeNational

బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం

వీధిలో గొడవ జరుగుతుంటే ఓ మహిళ బంగ్లా పైనుంచి చూసింది. కింద కొట్లాడుకుంటున్న యువకులలో ఒకడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దురదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గురితప్పి బంగ్లాపై ఉన్న మహిళకు తాకింది. నార్త్ ఢిల్లీలోని దయాళ్ పూర్ లో శనివారం చోటుచేసుకుందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని బ్రిజ్ పురికి చెందిన హషీం, బబ్లూల మధ్య జరిగిందీ గొడవ. హషీం ఇటీవల బబ్లూకు 17 వేల రూపాయలు అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న బబ్లూ శనివారం దయాళ్ పూర్ లో హషీంకు తారసపడ్డాడు. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని అక్కడే గట్టిగా నిలదీశాడు. ఇది కాస్తా ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఇద్దరూ గొడవపడుతుండగా బబ్లూ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. నలుగురూ కలిసి హషీంపై దాడికి దిగారు. వీధిలో అరుపులు వినిపించడంతో ఏం జరుగుతోందని పక్కనే ఉన్న బిల్డింగ్ పైనుంచి ఓ మహిళ తొంగిచూసింది. ఇంతలో కోపం పట్టలేక బబ్లూ అనుచరుడు కమ్రూల్‌ తన దగ్గరున్న తుపాకీ తీసి హషీంపై కాల్పులు జరపగా.. బుల్లెట్ మిస్ ఫైర్ అయి నేరుగా మహిళను తాకింది

Also read :తండ్రి కష్టం చూడలేక కూతురు దారుణం…

భర్తను చీరకు బిగించి హత్య చేసిన భార్య! ఎందుకంటే..

Related posts

Share via