October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Vizianagaram: దారుణం.. ఊయలలో ఉండగానే ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరునెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

రామభద్రాపురం: విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరునెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో రక్తస్రావమైంది. ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రామభద్రాపురం మండలంలో శనివారం ఈ ఘటన జరిగింది.

Also read :కన్న తండ్రి దుష్ట చేష్ట.. సోషల్ మీడియాలో కుమార్తె నగ్న చిత్రాలు, వీడియోలు!

బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని ఈ సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర అక్కడికి వచ్చి చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో గట్టిగా ఏడ్చింది. ఏడుపు విని చిన్నారి అక్క (పెద్ద కుమార్తె) అక్కడికి చేరుకుని వెంటనే తల్లికి సమాచారం అందించింది.

Also read :విద్యార్థి ఆత్మహత్యకేసులో కొత్త ట్విస్ట్.. ఆమె వేధింపులతోనే..

ఈ క్రమంలో తల్లితో పాటు గ్రామస్థులు నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించగా.. పరారయ్యాడు. అనంతరం చిన్నారిని బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరంలోని ఘోష ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ శ్రీనివాసరావు ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నార్లవలస వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు

Also read :హిందూ ధర్మ పరిరక్షణకు, హిందువుల ఐక్యతకు విశ్వ హిందు పరిషత్ కృషి

కుమారునికి ఉరివేసి, తల్లి ఆత్మహత్య

చిన్న వయసులోనే దానికి అడిక్ట్ అయ్యింది! నర్స్ కావాలనుకుని!

Related posts

Share via