కొండుకూర్లో రాత్రి పట్టుబడిన దొంగ పోలీసు
గతంలో కరీంనగర్లో స్వామిజీ వేషధారణలోఇప్పుడు పోలీసు డ్రెస్ వేసుకుని మరీ.. దొంగతనం

ఆదిలాబాద్: సాధారణంగా దొంగలు పోలీసులకు భయపడుతుంటారు. ఎక్కడ వచ్చి పట్టుకుంటారో అని. అందుకే ఓ దొంగ వినూత్నంగా ఆలోచించాడు. పోలీసులకు దొరక్కుండా ఉండాలంటే తానూ వారిలో ఒకడిగా మారిపోతే పోలా.. అనుకున్నాడు. ఎలాగో ఓ పోలీసు యూనిఫాం సంపాదించాడు. రోజూ ఆ పోలీసు దుస్తులు వేసుకొని తానొక కానిస్టేబుల్ని అంటూ లాఠీ చేత్తో పట్టుకొని బిల్డప్ ఇస్తూ వీలు చిక్కిన దగ్గరల్లా చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. పోలీసు గెటప్ వేసినా దొంగ లక్షణం పోదుకదా.. దొరికిపోయాడు. అసలు పోలీసులు రంగంలోకి దిగేసరికి నకిలీ పోలీసు బాగోతం బయటపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కడెం మండలం కోండుకూరు గ్రామంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో స్థానికులు తలల పట్టుకున్నారు. చివరికి ఓ పోలీసే దొంగ అని తెలిసి అవాక్కయ్యారు. కానిస్టేబుల్ బట్టలు వేసుకొని, లాఠీ చేత్తోపట్టుకొని ఠీవీగా వచ్చి పెట్రోలు బంకులో సెల్ఫోను కొట్టేసి, సమీపంలోని ఓ దాబాలో మరో చోరీకి యత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితుడు కరీంనగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Also read
- కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
- మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
- ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్ తో ప్రేమ
- చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయా.. అంత్యక్రియలకు వచ్చి..
- మినీ మహానాడు లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి…..