అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం రేపాయి. సుమారు 13 అడుగుల పొడవు ఉన్న ఈ కొండచిలువలను పశువులను మేపేందుకు వెళ్లిన గ్రామస్థులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.
సాధారణంగా కొండచిలువలను దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటాం. అలాంటిది దగ్గరకు వస్తే.. ఇంకేమైనా ఉందా.! దెబ్బకు హడలిపోతారు. ఊరు చివరిన ఉన్న మామిడి తోటలో ఏకంగా రెండు కొండచిలువలు వచ్చాయి. వాటిని చూడగానే అక్కడ పని చేసే సిబ్బంది దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం రేపాయి. సుమారు 13 అడుగుల పొడవు ఉన్న ఈ కొండచిలువలను పశువులను మేపేందుకు వెళ్లిన గ్రామస్థులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ శోభనాద్రి నేతృత్వంలోని రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి చాకచక్యంగా రెండు కొండచిలువలను పట్టుకుంది. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.
Also read
- గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు.. హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..
- అందగా ఉంటుందని.. అమాయకరాలు అనుకునేరు..! విశాఖ రాథోడ్ మామూల్ది కాదు..
- ప్రేమ పేరుతో దారుణం.. బస్సులో నుంచి దింపి పొలాల్లోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యం..!
- Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
- Hyderabad: హలో.. నేను అనన్య కులకర్ణి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్కు సాఫ్ట్గా లైన్ కలిపింది.. కట్ చేస్తే..





