Vijayawada: ఏపీలో కొందరు ఉద్యోగులు రెస్టు లేకుండా పని చేస్తున్నారా? కనీసం ఇంటికి సైతం వెళ్లకుండా ఆఫీసులో గంటలు తరబడి గడుపుతున్నారా? ఆఫీసు వర్క్ ఏమోగానీ.. పర్సనల్ వర్క్ మాత్రం చేస్తున్నాడు ఓ సీనియర్ ఉద్యోగి. ఏకంగా ఆఫీసును తన బెడ్ రూమ్ మార్చేసుకున్నాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ ఎవరు, ఏంటి అనే స్టోరీలో వెళ్తే..
అసలు స్టోరీ ఏంటి?
రాసలీలలకు అడ్డగా మారుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులను తమ లైంగిక కోర్కెలు తీర్చుకునేందుకు షెల్టర్లుగా వాడుకుంటున్నారు. విజయవాడలోని బందర్ రోడ్డులో లైలా కాంప్లెక్స్ ఉంది. దాని దిగువన ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయం ఉంది. అందులో కమర్షియల్ విభాగాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ బిల్డింగ్ పెద్దదిగా ఉండడంతో గేట్లు ఏర్పాటు చేశారు. దానికి సెక్యూరిటీ కూడా ఉన్నారు.
ఓ సీనియర్ ఉద్యోగి రాసలీలల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు నచ్చిన యువతులు, మహిళలను అక్కడికి తీసుకొచ్చి వారితో కామ క్రీడలకు వేదికగా మార్చుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆఫీసులో పెండింగ్ పని పూర్తి చేయడానికి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చేవాడు. బైక్పై ఓ మహిళను తీసుకొచ్చి తాళం తీసి లోపలికి వెళ్లేవాడు.
ఓ రేంజ్లో ఆ ఉద్యోగి బిల్డప్
గంట లేదా రెండు గంటలు లోపల గడిపి ఆ తర్వాత ఆఫీసుకు తాళం వేసి వెళ్లి పోయేవాడు. తొలుత లైటుగా తీసుకున్న సెక్యూరిటీ, ఆ ఉద్యోగి తీరుపై అనుమానం రెట్టింపు అయ్యింది. రోజుకో మహిళను తీసుకురావడంతో కొద్దిసేపు గడిపి వెళ్లిపోతున్నాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో ఆ సీనియర్ ఉద్యోగి సీక్రెట్ వ్యవహారం బయటపడింది.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు సదరు ఉద్యోగిపై విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్లోనున్న ఆ వ్యక్తి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. ఆయన్ని వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఆ కార్యాలయం సెక్యూరిటీ సిబ్బంది వద్ద నుంచి వివరాలు సేకరించారు అధికారులు. దర్యాప్తు నివేదికను అధికారులు ఎగ్జిక్యూటివ్ ఈడీకి ఇచ్చారు. నివేదిక ఆధారంగా అకౌంటెంట్పై చర్యలకు రంగం సిద్ధమయ్యింది.
Also read
- నరసింహ జయంతి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. ఎందుకంటే..
- నేటి జాతకములు..7 మే, 2025
- Garuda Puranam: మరణం తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా..?
- క్షుద్రపూజలు చేస్తున్నారనీ అనుమానం.. పాన్ వ్యాపారి హత్యకేసులో సంచలన విషయాలు
- Andhra News: ఆత్మహత్య చేసుకుందామని వెళ్లారు.. ఒక్కరు మాత్రమే తిరిగొచ్చారు.. అసలు అక్కడ ఏం జరిగింది!