SGSTV NEWS
Spiritual

Garuda Puranam: మరణం తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా..?

గరుడ పురాణం మనిషి మరణానంతర జీవితాన్ని వివరంగా చెప్పే పురాణంగా ప్రసిద్ధి చెందింది. ఆత్మ ఎటువంటి దశలు ఎదుర్కొంటుందో, పాపాలు చేసిన వారికి ఏ విధమైన శిక్షలు వస్తాయో ఇందులో వివరంగా ఉంది. ఇది ధర్మాన్ని పాటించేలా మనకు స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తుంది.

ఇది కూడ చదవండి :Garuda Puranam: మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..? మరల జన్మ పొందేందుకు ఎంత సమయం పడుతుంది..?

గరుడ పురాణం ఇది మనిషి మరణం తర్వాత ఎలాంటి దశలను ఎదుర్కొంటుందో చెబుతుంది. మనం జీవితంలో చేసే పనుల మీద ఆధారపడి మన ఆత్మకు పుణ్యం లేదా శిక్ష దక్కుతుంది. గరుడ పురాణం చెప్పిన విధంగా మంచి పనులు చేసిన వాళ్లు శాంతిగా ఉంటారు. చెడు పనులు చేసిన వాళ్లు మాత్రం ఎన్నో కఠినమైన శిక్షలు పొందుతారు.

ఇది కూడ చదవండి :Garuda Puranam: మరణానంతర జీవితం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?

మరణం తర్వాత ఆత్మ అస్వచ్చత స్థితిలో ఉంటుందనేది గరుడ పురాణం చెప్పే మొదటి విషయం. ఈ స్థితిలో ఆత్మ శుద్ధి కోసం గట్టిగా తపస్సు చేయాల్సి వస్తుంది. ఇది బాధతో కూడిన దశగా ఉంటుంది.

పాపాలు చేసిన ఆత్మను యమదూతలు పట్టుకుని యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ ఆత్మకు కఠిన శిక్షలు వేస్తారు. ఈ దశ చాలా భయానకంగా ఉంటుంది.

ఇది కూడ చదవండి:Garuga Puranam: ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని గుర్తించండి.. ఎప్పటికీ మోసపోరు

పాపాలు చేసిన మనిషి ఆత్మను నేరుగా అగ్నిలో వేస్తారు. ఇది ఆత్మకు తీవ్రమైన తాపాన్ని కలిగిస్తుంది. శరీరాన్ని కాల్చే ఈ శిక్ష చాలా భయంకరమైనదిగా వర్ణించబడింది.

ఆత్మను ఎముకల మధ్య వేలాడదీస్తారు. దీని వల్ల శరీరం విరిగిపోతూ తీరని నొప్పిని కలిగిస్తుంది. ఇది శారీరకంగా కాక మానసికంగా కూడా బాధను కలిగించే దశ.

ఇది కూడ చదవండి:Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నం అయినట్లట

పాపాలు చేసిన మనిషి ఆత్మను వేడి లోహ పాత్రలో వేస్తారు. ఇది కాల్చే బాధను మించిన కష్టాన్ని కలిగిస్తుంది. ఇది శిక్షలలో ఒకటి.

సింహాసనంపై కూర్చోబెట్టడం.. ఇది వినడానికి అద్భుతంగా అనిపించొచ్చు.. కానీ ఇది శిక్ష. ఈ సింహాసనంలో కూర్చోబెట్టి ఆత్మకు మానసిక బాధను కలిగిస్తారు. శారీరకంగా కూడా బాధను అనుభవించాల్సి వస్తుంది.

ఇది కూడ చదవండి:Garuda Puranam: ఇంట్లో కలహాలకు కారణాలు ఇవే..! గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?

ఆత్మను ముళ్లతో గుచ్చుతారు. ఇది రక్తాన్ని కారించే స్థితికి చేరుతుంది. ఈ సమయంలో బాధకు అంతం అనేదే ఉండదు.

ఆత్మను మండే నీటిలో ముంచుతారు. ఇది మరింత కష్టాన్ని తెచ్చిపెడుతుంది. శరీరం తట్టుకోలేనంతగా కాలిపోతుంది.

ఇది కూడ చదవండి:Garuda Puranam: భర్తలు జాగ్రత్త.. మీ భార్యని ఇలా బాధపెడుతున్నారా.. గరుడ పురాణం ప్రకారం ఏఏ శిక్షలో తెలుసా..

పాపాలు చేసిన మనిషి ఆత్మను వాంతితో కలిపిన అగ్నిలో వేస్తారు. ఇది శాశ్వతంగా ఆత్మను నాశనం చేస్తుంది. ఇది చాలా దారుణమైన శిక్షగా గరుడ పురాణం చెబుతుంది.

ఆత్మను చీకటి గుహలలో వదిలేస్తారు. అక్కడ శాంతి ఉండదు. బాధ మాత్రం ఎప్పటికీ ఆగదు. ఇది నిరంతరం కష్టాన్ని కలిగించే స్థితి.

ఇది కూడ చదవండి:Garuda Puranam: మీ జీవితాన్ని మార్చేసే పది సూత్రాలు..! మీ కష్టాలన్నీ దూరం అవుతాయి..!

ఈ శిక్షలు అన్నీ పాపాల కారణంగా ఎదురయ్యే దశలు. కానీ మంచి పనులు చేసిన వారికి ఇవేవీ జరగవు. కనుక మనం జీవితంలో మంచి మార్గంలో నడవాలి. ధర్మం పాటిస్తే ఆత్మ శాంతిని పొందుతుంది అని గరుడ పురాణం మనకు బోధిస్తుంది

ఇది కూడ చదవండి:Garuda Puranam: పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?

Related posts

Share this