వైస్ ప్రిన్సిపల్ వేధింపుల కారణంగా రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం, కొత్లాపూర్ గ్రామానికి చెందిన ముక్కగల్ల తబితా (15) జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కొత్తగడి హాస్టల్లో 10వ తరగతి చదువుతుంది.
ఈ అమ్మాయిని బ్యాడ్ క్యారెక్టర్ అంటూ విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే తన తోటి విద్యార్థుల ముందు అవమానించడం జరిగిందని, ముఖ్యంగా పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ అయిన స్రవంతి టీచర్ ఘోరంగా అవమానించిందని విద్యార్థిని ఆమె తల్లిదండ్రులను కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గత ఫిబ్రవరి నెల 24 తారీఖు సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ… నేను ఏ తప్పు చేయకపోయినా వైస్ ప్రిన్సిపాల్ స్రవంతి టీచర్ నన్ను బ్యాడ్ అమ్మాయి అంటూ అవమానిస్తుందని కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ మధ్య జరిగిన ఫేర్వెల్ కార్యక్రమం సందర్భంగా నేను పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో బైపిసి గ్రూప్ తీసుకొని పెద్దయ్యాక వెటర్నరీ డాక్టర్ అవ్వాలని అనుకున్నానని చెప్పగా, అందుకు స్రవంతి టీచర్ నీ మొహానికి డాక్టర్ అవుతావా.. ఏదో మెడికల్ షాప్ పెట్టుకొని బ్రతుకు అని చిన్నతనంగా మాట్లాడి అందరి ముందు అవమానించింది.
ఈ కారణంగానే బ్రతుకు పైన విరక్తి కలగడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గత ఫిబ్రవరి నెల 24వ తారీఖున హాస్టల్ బిల్డింగ్ మొదటి అంతస్తు పైనుంచి దూకడం జరిగిందని తెలిపింది. దూకిన వెంటనే ఎడమ కాలు వేళ్లకు ప్యాక్చర్ అయింది.
దాంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్ళగా, అక్కడ ఆత్మహత్య ప్రయత్నం చేసింది అంటే ట్రీట్మెంట్ కు ఇబ్బంది అవుతుందని, పోలీస్ కేసు అవుతుంది కాబట్టి మెట్ల పై నుంచి జారి పడింది అంటూ చెప్పాలని టీచర్లే తప్పుగా చెప్పించి ట్రీట్మెంట్ చేయించారు.
ఆ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తమ కూతురికి చికిత్స చేయించామని, పేద కుటుంబమైన మాకు రూ.1 లక్షకు పైనే ఖర్చు అయ్యాయని తల్లిదండ్రులు ముక్కగల్ల యాదయ్య, ముక్కగల్ల రాణెమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మా కూతురు ప్రాణం పోయి ఉంటే ప్రాణం కట్టించేవారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి మా కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన టీచర్ స్రవంతిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని హాస్టల్ ముందు ధర్నాకు దిగారు.
వీరికి ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా నిలిచి ధర్నా చేయడం జరిగింది. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధ్యులపై ఫిర్యాదు చేస్తే తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
ఇదిలా ఉంటే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వైస్ ప్రిన్సిపాల్ స్రవంతి టీచర్ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించగా, కళాశాల ప్రిన్సిపల్ మాత్రం ఈ సంఘటనపై నాకు ఎలాంటి సమాచారం లేదని, కేవలం అమ్మాయి కాలుజారి కింద పడింది అని మాత్రమే నాకు చెప్పారని చెప్పడం గమనార్హం.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొత్తగడి రెసిడెన్షియల్ స్కూల్..!
జిల్లాలో అనేక రెసిడెన్షియల్ హాస్టల్లు, కేజీవీబీ, ఎస్ఎల్బి హాస్టల్స్, ఇతర ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలోని కొత్తగాడి రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. గతంలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోవడంతో అప్పుడు కూడా అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి హాస్టల్ ముందు ధర్నాకు దిగారు.
ఆ తర్వాత ఇదే హాస్టల్ లో పరిశుభ్రత సరిగ్గా లేని కారణంగా హాస్టల్ లో ఉన్న దాదాపు అందరు విద్యార్థులకు జాండీస్ వ్యాధి వచ్చి రాష్ట్రంలో సంచలనం అయింది. అయినా కూడా ఈ హాస్టల్ పై ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే మరోసారి తబితా అనే పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ హాస్టల్లో పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల రాక్షసులుగా ప్రవర్తించడం, వారిని మానసికంగా అవమానించడం, ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సదరు హాస్టల్ పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి తప్పు చేసిన వారిపై వెంటనే సస్పెండ్ వేటు వేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!