“నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది.
“నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. నన్ను రక్షించండి మహాప్రభో!” అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తల గొడవ అనుకొని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వీడియో ఆధారాలతో సహా బాధితుడు మళ్లీ పోలీస్ స్టేషనుకు వచ్చాడు. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి వీడియో తీశాడు. ఆ వీడియోలో భర్తను ఆమె హింసిస్తున్న తీరు చూశాక.. పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నౌర్ జిల్లాకు చెందిన మనన్ జైదీ, మెహర్ జహాన్ భార్యాభర్తలు. మెహర్ భర్తను నిత్యం హింసించడం అలవాటుగా చేసుకొంది. మెహర్పై కేసు నమోదు చేశామని బిజ్నౌర్ జిల్లా ఏఎస్పీ మీడియాకు తెలిపారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





