*సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్ని జాతులు,వర్గాల పైన ఉంది…. శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహాస్వామి*
అమరావతి:
వైశ్య కుల గురువు, శృంగేరి పీఠ శిష్య పరంపర, పరమపూజ్య శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామిజీ వైశ్య గురు మఠం వారణాసి మరియు హల్దీపూర్, కర్ణాటకకు చెందిన స్వామీజీ
శ్రీ విశ్వావసు నామ సంవత్సర 22వ చాతుర్మాస్య వ్రతం సందర్భంగా గుంటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో చాతుర్మాస దీక్ష సందర్భంగా దేవాలయంలో కొలువై ఉన్నారు. వారి కరపద్మములతో శ్రావణ శుక్రవారం రోజున బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మకు దుశాల్వాతో సత్కరించి మహా ఆశీర్వాదం అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత బ్రాహ్మణ వైశ్య కులాలపై ఎంతైనా ఉందని, సనాతన ధర్మాన్ని కాపాడటంలో ఈ ఇరు జాతులు పురాణ కాలం నుంచి ముఖ్య భూమిక పోషిస్తున్నారని, ఈ నవ నాగరిక సమాజంలో కూడా ఇద్దరు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని, అలానే మిగిలిన జాతులు వారు కూడా సనాతన ధర్మం పట్ల దేవాలయాల పట్ల మక్కువ చూపేలా చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక చింతనను వారి వారి పిల్లలకు అలవాటు చేయాలని, ఈ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందేలా సమాజంలో ఉన్న అన్ని జాతులు, వర్గాలు కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమానూరు సురేష్, రవి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!