July 3, 2024
SGSTV NEWS
Telangana

కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా కొనసాగుతున్న వలసలు.



బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీటీసీ లు,కాంగ్రెస్ పార్టీలో చేరిక.

కోడేరు మండల పరిధిలోని మచుపల్లి గ్రామ ఎంపీటీసీ శ్రీమతి. M.లావణ్య లక్ష్మయ్య గారు, కోడేరు గ్రామ ఎంపీటీసీ కృష్ణయ్య గార్లు *రాష్ట్ర మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారి* సమక్షంలో కొల్లాపూర్ లో బి ఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కొల్లాపూర్ నియోజకవర్గం జూపల్లి గారి నాయకత్వం లోనే  అభివృద్ది పథంలో ముందుకు వెళ్తుందని,గత పాలకులు అభివృద్ది నీ గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు.అందుకే జూపల్లి గారి నాయకత్వాన్ని బలపర్చెందుకు  కాంగ్రెస్ పార్టీలో చేరానని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో  కోడేరు మాజీ ఎంపీపీ రామ్మోహన్ రావు గారు, కొల్లాపూర్ మండల,పట్టణ ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు..

SGS ప్రతినిధి..సత్యనారాయణ కోడేరు మండలం

Related posts

Share via