భారత్లో రోజు రోజుకు వైవాహిక సంబంధాలు దిగజారిపోతున్నాయనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. భార్య ఉండగానే మరో మహిళతో, భర్త ఉండగానే మరో మగాడితో తిరిగే పాశ్చాత్య కల్చర్ దేశంలో పెరిగిపోతుంది. అలాంటి సంఘటనలు రోజుకు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వైవాహిక సంబంధాలు మధ్యలోనే…
భారత్లో రోజు రోజుకు వైవాహిక సంబంధాలు దిగజారిపోతున్నాయనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. భార్య ఉండగానే మరో మహిళతో, భర్త ఉండగానే మరో మగాడితో తిరిగే పాశ్చాత్య కల్చర్ దేశంలో పెరిగిపోతుంది. అలాంటి సంఘటనలు రోజుకు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వైవాహిక సంబంధాలు మధ్యలోనే తెగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియురాలితో రోడ్డుపై తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. నడిరోడ్డుపై భర్త, అతడి ప్రియురాలికి బడితె పూజ చేసింది.
ఉత్తర ప్రదేశ్లో గురువారం చోటుచేసుకుంన్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అతడి భార్య చెవిన పడటంతో కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆ వ్యక్తి తన ప్రియురాలితో నర్వాల్ మోద్ ఏరియాలో భార్య కంటపడ్డాడు. వెంటనే భర్తను నిలదీసింది. ఈ క్రమంలో భార్య, ప్రియురాలు నడి రోడ్డు మీదే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భార్యకు సర్దిచెప్పి ఇంటికి పంపడంతో గొడవ సరద్దుమణిగింది.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోయాయంటూ పోస్టులు పెడుతున్నారు. భార్యాభర్తల బంధం అంటే బూతులా మారిపోయింది అంటూ మండిపడుతున్నారు
Also read
- Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్పై తీవ్ర ఆరోపణలు!





