అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దర్ని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతం వద్ద ప్రమాదం విషాదం చోటుచేసుకుంది. జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థులలో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు జలపాతంలో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దర్ని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, యువకుడు ఉన్నారు. మొత్తం 14 మంది వైద్య విద్యార్థులు ఏలూరు నుంచి విహార యాత్రకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





