Pinnelli Ramakrishna Reddy: మాచర్ల నియోజక వర్గంలో హై అలర్ట్ నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారట పోలీసులు. పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా తీసుకుంది ఎన్నికల సంఘం.
దీంతో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బృందాలుగా వీడి పోయి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోసం గాలిస్తున్నారట ఏపీ పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ను ఆదేశించింది. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఈసీ భావిస్తున్నది.
Also read
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!
- జైల్లో ఉన్న భర్తను బెయిల్పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే
- బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్, కోల్కతాతో లింకులు బట్టబయలు..





