తన కుమారై పై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు విషయం బయటపడటంతో నిర్దోషిగా విడుదలయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ మహిళకు కోర్టు జైలు శిక్షతో పాటు రూ.5.88 లక్షల జరిమానా విధించింది. యూపీకి చెందిన మహిళ తన కూతురి పై ఓ యువకుడు అత్యాచారం చేశాడని 2019లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని ఆమె కూతురు కూడా వాంగ్మూలం ఇచ్చింది. కేసు పెండింగ్లో ఉండగా, నిందితుడు 4ఏళ్లు జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా విచారణలో భాగంగా తాజాగా ఆ బాలిక తన వాంగ్మూలం తప్పని కోర్టులో అంగీకరించింది. దీంతో అదనపు సెషన్స్ న్యాయస్థానం అజయ్్న నిర్దోషిగా ప్రకటించింది. తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లికి 340 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది
Also read
- నేటి జాతకములు…15 మే, 2025
- మామ వెంటనే నా భార్యను మా ఇంటికి పంపు..!
- వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
- నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు…108 సర్టిఫికెట్లు స్వాధీనం
- Hyderabad Tragedy: హైదరాబాద్లో విషాదం.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన పిల్లర్ గుంత!