కుమారుడు క్షణికావేశంలో తల్లిని కొట్టడంతో మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పులలో శనివారం చోటు చేసుకుంది.
శాయంపేట, : కుమారుడు క్షణికావేశంలో తల్లిని కొట్టడంతో మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పులలో శనివారం చోటు చేసుకుంది. సీఐ రంజిర్రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మోతె తిరుపతిరెడ్డి శనివారం తన ఇంటి పక్కనున్న చింత చెట్టు విషయంలో పక్కింటి వారితో గొడవ పడ్డాడు. భార్య నాగరాణి ఆయనను వారించి ఇంట్లోకి తీసుకెళ్లారు. దీంతో తిరుపతిరెడ్డి భార్యను కొడుతుండగా ఆయన తల్లి అమృతమ్మ(85) అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తిరుపతిరెడ్డి పక్కనే ఉన్న మంచం పట్టెతో తల్లిని కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. ఆదివారం ఉదయం సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎస్సై ప్రమోద్ కుమార్ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు. మృతురాలి కుమార్తె రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Also read
- Andhra: కియాలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో పురోగతి.. 9 మంది అరెస్ట్
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం