Lబనశంకరి: తన ఇద్దరు పిల్లలను హత్యచేసిన కేసులో పరప్పన అగ్రహార జైలులో రిమాండ్లో ఉన్న తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గంగాదేవి అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జాలహళ్లిలో నివాసం ఉంటోంది. గంగాదేవి ప్రైవేటు కంపెనీలో, భర్త బీబీఎంపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గంగాదేవి మంగళవారం రాత్రి కుమార్తె లక్ష్మీ(7), గౌతమ్ను ఈనెల 9న దిండుతో ఊపిరా ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం సహాయవాణికి ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతున్నట్లు తెలిపింది. పోలీసులు రాగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహరజైలుకు తరలించారు. ఆదే రోజు రాత్రి జైలులో ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టర్లు మృతదేహానికి పంచనామా చేపట్టిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈఘటనపై పరప్పనఅగ్రహార పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025