పిల్లలు చికెన్ కావాలని అడిగినందుకు ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో పిల్లల్ని ఎడాపెడా కొట్టింది. దెబ్బలు తాళలేక హాస్పిటల్ పాలైయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 7ఏళ్ల కొడుకు మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఆదివారం చోటుచేసుకుంది.
కన్నకొడుకు చికెన్ కావాలని అడిగినందుకు ఓ తల్లి కన్నబిడ్డలపై కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఆ బాలుడిని ఎడాపెడా కొట్టింది. దెబ్బలు తాళలేక ఆ బాలుడు హాస్పిటల్ పాలైయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఆదివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిన్మయ్ ధుమ్డే అనే బాలుడు తన తల్లి పల్లవి ధుమ్డేతో చికెన్ తినాలని ఉందని మారం చేశాడు. ఆగ్రహించిన ఆమె కొడుకు, కూతుర్ని రొట్టెల కర్రతో బాగా కొట్టింది. ఏడేళ్ల కొడుకు, పదేళ్ల కూతురు ఇద్దరు తల్లి కొట్టిన దెబ్బలకు తాళలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ కొడుకు మరణించాడు.
అరుపులు విన్న పొరుగువారు పోలీసులకు సమాచారం అందించగా, స్థానిక పోలీసులు, స్థానిక క్రైమ్ బ్రాంచ్, సబ్-డివిజనల్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితురాలు మహిళను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also read
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
- చనిపోయిన తండ్రిని మరిచిపోలేక.. ఆయన కోసం..