July 3, 2024
SGSTV NEWS
Crime

భర్త కాదు రాక్షసుడు.. భార్య తల నరికి.. చర్మం ఒలిచి.. అత్యంత దారుణంగా..


Karnataka Crime News: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని.. హత్యలు చేసుకునే వరకు వెళ్తున్నాయి. క్షనికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి.

వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పెద్దల, బంధుమిత్రులు దీవిస్తుంటారు. కానీ ఈ మధ్య భార్యాభర్తల మధ్య వస్తున్న విభేదాల కారణంగా పెళ్లైన కొద్ది రోజుల్లోనే విడిపోతున్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, వరకట్నం, వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అవి కాస్త పెద్దల వద్దకు వెళ్లడంతో చిలికి చిలికి గాలివానగా మారి విడిపోతున్నారు.   భార్య తనకు డిన్నర్ వడ్డించలేదన్న చిన్న కారణంతో భర్త చేసిన పని తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. విరాల్లోకి వెళితే..


ఈ మధ్య కొంతమంది మనుషుల్లో నేర స్వభావం పెరిగిపోతుంది.. చిన్న విషయాలకే కోపోద్రిక్తులై ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. కేవలం తనకు డిన్నర్ వడ్డించలేదన్న పాపానికి తన భార్యను దారుణంగా చంపడమే కాదు.. తల నరికి, చర్మం వలిచి పైశాచిక ఆనందం పొందాడు భర్త. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.కర్ణాటకలోని తుమకూరులో 35 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కుణిగల్ తాలూకాలోని హులియూరుదుర్గ వద్ద టింబర్ మిల్లు ఉద్యోగి శివరామ, పుష్పలత(35) దంపతులు నివసిస్తున్నారు. శివరామ దగ్గరలోని ఓ మిల్ లో కూలీగా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా పుష్పలత, శివరామ నిత్యం గొడవ పడుతుండేవని, సోమవారం రాత్రి శివరామ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు. తనకు భోజనం వడ్డించమని భార్యను కోరాడు.. పుష్పలత అందుకు నిరాకరించింది. నాకు చేత కావడం లేదు.. నువ్వే భోజనం పెట్టుకో అని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.
ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారి శివరామ కోపంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కత్తితో పొడిచి చంపాడు. అయినా అతని కోపం చల్లారలేదు.. భార్య తల నరికాడు. ఆ తర్వాత భార్య చర్మం ఒలిచాడు. ఇంట్లో శబ్ధాలు రావడంతో యజమాని వచ్చి చూసి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంత పోయారు. రాక్షసులు కూడా అంత దారుణంగా ప్రవర్తించని పోలీసులు తెలిపారు. దారుణమైన విషయం ఏంటంటే.. హత్య జరిగే సమయానికి ఏనిమిదేళ్ల కుమారుడు నిద్రిస్తున్నాడు. పోలీసులు విచారణలో శివరామ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమితం తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.

Also read

Related posts

Share via