SGSTV NEWS online
Andhra PradeshCrime

ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి…



పటమట(విజయవాడతూర్పు): బీటెక్ చదివిన సూరవరపు  షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమ-వారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు.

భీమవరానికి చెందిన షకీనాకు రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్ ఇంజినీర్ పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు.

Also read

Related posts