పటమట(విజయవాడతూర్పు): బీటెక్ చదివిన సూరవరపు షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమ-వారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు.
భీమవరానికి చెందిన షకీనాకు రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్ ఇంజినీర్ పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు.
Also read
- Garuda Puranam: 13 రోజుల వరకు చనిపోయిన వారి ఆత్మ ఇంటి చుట్టూనే తిరుగుతుందా? అసలు విషయం ఇదే
- Shri Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస సమయాలివే
- నేటి జాతకములు..29 ఆగస్టు, 2026
- విశాఖ రేవ్ పార్టీలో నేతల మధ్య రచ్చ.. అమ్మాయిల కోసం కొట్లాట, ఆపై కత్తిపోట్లు, అసలు ఏం జరిగింది?
- ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి…





