నిజాంపేట్: వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నవీన్ దుర్వే, రవీనా దుర్వే(28) నగరానికి వలస వచ్చి బాచుపల్లిలోని వెనుక ఉన్న ప్రగతి కాన్స్టరెక్టన్ లో కార్మికులుగా పనిచేస్తూ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం.సోమవారం రాత్రి వంట విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వంట సరిగా చేయడం లేదని ఆగ్రహానికి లోనైన నవీన్ ఇటుకతో భార్య రవీనా తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నవీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!