అది శ్రీరాముని ఆలయం.. భక్తులంతా శ్రావణమాస పూజల్లో నిమగ్నమయ్యారు. పూజారి కూడా సీతారాములకు పూజలు చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అందరూ ఉరుకులు.. పరుగులు తీశారు. హడావుడి మొదలైంది. కట్ చేస్తే.. అసలు విషయం తెలిసి, పూజారి సైతం పరుగు అందుకున్నారు. తీరా చూస్తే, నాగు పాము కలకలం రేపింది. భుసలు కొడుతూ హడలెత్తించింది. విశాఖ మల్కాపురం శ్రీరాముని ఆలయంలో భక్తుల హడావుడితో పడగ విప్పి హల్చల్ చేసింది ఆరడుగుల నాగు పాము. దీంతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు.. చాకచక్యంగా పామును బంధించి, నగర శివారు లో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also read
- నేటి జాతకములు..17 అక్టోబర్, 2024
- Nandivardhanam: ఈ నందివర్థనం పూలతో ఉండే బెనిఫిట్స్ ఊహించనవి.. షాక్ అవ్వక తప్పదు..
- 16వ శతాబ్దం నాటిఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్
- ఆశ్వీయుజ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి…..!(17.10.24)
- Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..