ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణ శివారు రైతునగర్లో దొంగలు రెచ్చిపోయారు. శివసాయి గ్రీన్ హోమ్స్ కాలనీలో టీడీపీ నేత కోదండ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానిక నౌమాన్ నగర్లో ఉన్న తమ కూతురు ఇంటికి కోదండ రెడ్డి దంపతులు వెళ్లి తిరిగి వచ్చే లోపల ఇంట్లోని నగదు బంగారం అపహరిచి పరార్ అయ్యారు.
దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి రూ. 20 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును అపహరించారు.చోరీ విషయం తెలిసిన కోదండ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. రూరల్ పోలీసుల బాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు