సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని బావి నీళ్లు తాగిన 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బావి నీళ్లు తాగిన కాసేపటికే గ్రామంలోని పలువురు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. నీళ్లు తాగిన కాసేపటికే బీసీ కాలనీవాసులు..
సంగారెడ్డి, అక్టోబర్ 13: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని బావి నీళ్లు తాగిన 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బావి నీళ్లు తాగిన కాసేపటికే గ్రామంలోని పలువురు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. నీళ్లు తాగిన కాసేపటికే బీసీ కాలనీవాసులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వీరిని హుటాహుటీన పలు ఆస్పత్రులకు తరలించగా.. వైద్యులు చికిత్స ప్రారంభించారు. కలుషిత నీరు తగిన వారిలో ఇద్దరు మృతి చెందగా… పలువురి పరిస్థితి సీరియస్గా ఉంది. మృతులను మహేష్ (22), సాయమ్మ (70)గా గుర్తించారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రులలో 30 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.
బావిలోని నీరు తాగడంతో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అస్వస్థకు గురైన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. గ్రామస్థుల పాలిట యమపాశంలా మారిన బావి నీళ్లను ఎవరూ తాగకూడదంటూ అధికారులు ప్రకటించారు
Also read
- Nandivardhanam: ఈ నందివర్థనం పూలతో ఉండే బెనిఫిట్స్ ఊహించనవి.. షాక్ అవ్వక తప్పదు..
- 16వ శతాబ్దం నాటిఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్
- ఆశ్వీయుజ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి…..!(17.10.24)
- Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..
- Kidnap : మద్యం దుకాణం లాటరీ వచ్చిందనుకునే లోపే …కిడ్నాప్ అయ్యాడు!