మితిమీరిన జోష్ కొంప ముంచుతుంది. కరోనా తర్వాత ఏమవుతుందో ఏమో తెలియడం లేదు కానీ.. కాస్త బర్డెన్ పడినా చాలు.. చిట్టి గండెలు ఆగిపోతున్నాయి. అమలాపురంలో ఓ వ్యక్తి అలానే కన్నుమూశాడు.
డీజే.. ఉంటే చాలు పూనకాలు లోడింగ్ అవడానికి..! కానీ ఈ జోష్లో DJ హోరు హద్దులు దాటితే ఏకంగా ప్రాణాలే పోతాయ్..! తాజాగా కోనసీమలో ఇదే జరిగింది. మితిమీరిన DJ సౌండ్స్, దానికి తగినట్లుగా స్పీడ్ స్టెప్స్.. కట్ చేస్తే.. ఓ గుండె ఆగిపోయింది. అమలాపురం సమీపంలోని కొంకాపల్లి దసరా వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 21 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు. అప్పటివరకూ సరదాగానే గడిపిన యువకుడు.. ఒక్కసారిగా స్ఫృహతప్పిపోయేసరికి చుట్టుపక్కలవాళ్లు కంగారుపడ్డారు. వెంటనే అతనికి CPR చేశారు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐతే.. అతను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పడంతో విషాదం అలముకుంది.. మృతుడు బండారులంకకు చెందిన 21 ఏళ్ల వినయ్గా గుర్తించారు.
కోనసీమ ప్రాంతంలో దసరాకి చెడితాలింఖానా విన్యాసాలతో దసరా వేడుకలు జరుగుతాయి.. ఈ ఉత్సవాల్లో DJకి స్టెప్పులేస్తూ వినయ్ కుప్పకూలిపోవడంతో అంతా షాక్కి గురయ్యారు. హైదరాబాద్ నుంచి దసరా సెలవులకు సొంత ఊరు వచ్చాడు వినయ్. రెండు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఐతే.. శనివారం రాత్రి డీజే దగ్గర డాన్సులు చేస్తూ కుప్పకూలిపోయాడు. అతిగా DJ సౌండ్ పెట్టడం వల్ల ఆ ప్రభావం గుండెపై పడి ఇలా జరిగిందని స్థానికులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్లో దారుణం.. బాత్రూం బల్బ్లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య