మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి చిన్న పొరపాటు జరిగిన అది వాళ్ల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. ఓ భర్త భార్యకు తెలియకుండా ధాన్యం బస్తాలో నగదును దాచి పెట్టాడు. ధాన్యం బస్తాలో భర్త డబ్బు దాచిన విషయం తెలియని భార్య ఇంట్లో అవసరాల కోసం ఆ ధాన్యం బస్తాను అమ్మేసింది. ఈ విషయం తెలిసిన భర్త ఆ వ్యాపారి కోసం గ్రామంలో వెతికినా దొరకకపోవడంతో స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశాడు.
మధ్య తరగతి కుటుంబాల్లో కొంత మంది భార్య భర్తలు ఆర్థిక విషయాలను పంచుకోరు. కొందరు భర్తలు ఆర్థిక లావాదేవీల విషయాలు భార్యలకు చెప్పకుండా ఉంటారు. ఎందుకంటే తమతో డబ్బులు ఉన్నాయని తెలిస్తే అనవసర ఖర్చులు చేస్తారని..దాని వల్ల ఫ్యూచర్లో కష్టాలు వస్తే వాటిని అధిగమించడం ఇబ్బందిగా మారుతుందని వాటిని భద్రంగా దాచిపెడుతుంటారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఉంచుతారు. అయితే ఇలానే ఓ భర్త ధాన్యం బస్తాలో నగదును దాచి పెట్టిన విషయం తెలియని భార్య ఇంట్లో అవసరాల కోసం ఆ ధాన్యం బస్తాను అమ్మేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లో వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ చెందిన పోతరాజు వీరయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుటుంబ అవసరాల కోసం కొన్ని రోజుల క్రితం వీరయ్య తన దగ్గర ఉన్న రెండు ఎద్దులను అమ్మేశాడు. ఎడ్లను అమ్మేయడంతో వీరయ్యకు రూ.1.50 లక్షల నగదు వచ్చాయి. అయితే వీరయ్య ఆ డబ్బును ఇంట్లోని ఓ బియ్యం బస్తాలో దాచి పెట్టాడు. ఈ విషయాన్ని భార్యకు చెప్పలేదు.
అయితే ఒక రోజు భర్త పని నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో వీరి గ్రామంలోకి విడి ధాన్యం కొనుగోలు చేసే ఓ వ్యాపారి వచ్చాడు. అయితే ఆ బస్తాలో భర్త డబ్బులు దాచి పెట్టాడని తెలియని భార్య ఇంట్లో అవసరాల కోసం ధాన్యం బస్తాను ఆ వ్యాపారికి విక్రయించింది. ఇంతలో పొలానికి వెళ్లిన భర్త పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అతని ఇంట్లో ఉన్న ధాన్యం బస్తా కనిపించలేదు. దీంతో టెన్షన్ పడిన వీరయ్య.. ధాన్యం బస్తా గురించి భార్యను అడిగాడు. అయితే ఇంట్లో అవసరాల కోసం ఆ ధాన్యం బస్తాను అమ్మినట్టు భార్య తెలిపింది. దీంతో కంగారు పడిపోయిన భర్త వెంటనే ఆ వ్యాపారి కోసం గ్రామం మొత్తం వెతికాడు..కానీ ఆ వ్యాపారి ఎక్కడా కనిపించలేదు దీంతో వీరయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యాపారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!