ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయినందుకు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 24న బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేశారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు. ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థులిద్దరూ ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేరారు. తెలంగాణలోని నస్పూర్ మండలం దొరగారిపల్లి గ్రామానికి చెందిన గట్టిక తేజస్విని (18) మ్యాథ్స్ 1A, 1B రెండు పేపర్లు ఫెయిల్ అయిందని తెలుసుకుని చీరతో బెడ్రూమ్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మంచిర్యాలలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో చదువుతోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్లో ఆమె తండ్రి శంకర్ ఫిర్యాదు ప్రకారం, ఆమె తన మ్యాథ్స్ పరీక్షకు సంబంధించిన రెండు పేపర్లలో ఫెయిల్ కావడంతో మనస్థాపానికిగురై ఇలాంటి ఘటనకు పాల్పడిందని తెలిపాడు.
తేజస్విని ఘటన మరువక ముందే ఇలాంటి ఘటనే మరొకటి చేటు చేసుకుంది. తాండూరు గ్రామానికి చెందిన అచలాపూర్ మండలం మైతం నారాయణ కుమారుడు మైతం సాథ్విక్ (18) తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెల్లంపల్లివాస్లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్ మొదటి సంవత్సరం చదువుతున్న సాథ్విక్ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ విషయం ఇంట్లో చెబితే ఎక్కడ మందలిస్తారో అన్న భయంతో తల్లిదండ్రులకు చెప్పలేక మానసిక క్షోభకు గురై ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..