ఓ బాలుడు ఆడుకుంటూ వాగు సమీపంలోకి వెళ్లాడు.. ప్రమాదవశాత్తు జారి వాగులో పడిపోయాడు. అది గమనించిన బాబును కాపాడేందుకు నీటిలో దూకిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకునన్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు..ఈ విషాదకర ఘటన నల్గొం జిల్లాలోని చందంపేట మండలం దేవరచర్లలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చందంపేట మండలం దేవరచర్లకి చెందిన సాయి ఉమాకాంత్ అనే తొమ్మిదేళ్ల బాలుడు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ.. సమీపంలో ఉన్న డిండి వాగు దగ్గరకు వెళ్లాడు.ఈ క్రమంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాగులో జారిపడిపోయాడు. అది గమనించిన అటుగా వెళ్తున్నఇద్దరు వ్యక్తులు బాలుడిని కాపాడేందుకు వాగులో దూకి గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతులు స్థానికంగా నివసిస్తున్న రాజు(25), భరత్కుమార్(27)గా గుర్తించారు. మరోవైపు బాలుడి ఆచూకీ కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్న తెలుస్తోంది. మృతులు దసరా పండక కోసం బంధువల ఇంటికి వచ్చి ప్రమాదానికి గురైనట్టు సమాచారం
Also read
- ఈరోజు తొలి ఏకాదశి+శనివారం వేళ మీ ప్రేమ, కుటుంబం, కెరీర్ ఎలా ఉండబోతున్నాయి? రాశి ఫలాలు తెలుసుకోండి!
- Tholi Ekadashi: శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి ఉపవాసం ఎలా ఆచరించాలి?
- విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోరుతూ తరగతుల బహిష్కరణ….పి.డి.యస్. యు
- జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!
- Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం!





