July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఆన్‌లైన్ జూదం కోసం రైతుల సొమ్ము స్వాహా.. బంధుమిత్రుల కలిసి రూ. కోట్లు మాయం చేసిన‌ పోస్ట్ మాస్టర్!

ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్‌లో కోటి రూపాయలకు పైగా పత్తి రైతుల సొమ్మును పక్కదారి పట్టించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ దారిలో కాజేసి‌న ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ కేసులో తవ్వి‌న కొద్ది‌ అసలు బండారం బయటపడుతోంది. అమాయకులైన రైతులను బురిడి కొట్టించి, రైతుల జాబ్ కార్డ్ ఖాతాల్లోని లక్షల సొమ్మును అప్పనంగా కాజేశాడు. ఈ కేసులో మేనేజర్ కు సహకరించిన పోస్ట్ ఆఫీస్ లోని మరో ఉద్యోగిన పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న మేనేజర్ విజయ్ బందువైన చౌహాన్ పురుషోత్తంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల డబ్బులను దారి మళ్లించి అక్రమాలకు పాల్పడ్డ ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ కు పురుషోత్తం సహకరించినట్లు తేలింది. దీంతో ఏ-2 నిందితుడిగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. పురుషోత్తం అకౌంట్ నుండే రూ. 15 లక్షలకు పైగా రైతుల‌ డబ్బులు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా రైతులకు రావాల్సిన డబ్బులను జాబ్ కార్డ్‌లో జమ చేయగా, ఆ డబ్బులను అక్రమ దారిలో వీరిద్దరు కలిసి మాయం చేసినట్టు పోలీసులు తేల్చారు.

ఈ ఇద్దరే కాదు పత్తి‌రైతులను నిండా ముంచి‌న ఈ కేసులో కిలాడీ మేనేజర్ విజయ్ భార్య, మామ కూడా నిందితులే అని పోలీసులు తేల్చారు. మార్చి 22న కోర్ట్ లో లొంగిపోయిన నిందితుడు విజయ్ జాదవ్ ను పోలీసులు కస్టడికి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోటికి పైగా రైతుల‌ డబ్బులను అక్రమ మార్గంలో తన కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి మళ్లించి ఆ డబ్బుతో భార్య, మామకు చెందిన బంగారాన్ని బ్యాంక్ నుండి తాకట్టు విడిపించినట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 50 లక్షలతో ఆన్‌లైన్ జూదం ఆడిన ఆదిలాబాద్ పోస్ట్ ఆపీస్ మేనేజర్ విజయ్ జాదవ్.. రూ. 40 లక్షలకు పైగా జూదంలో పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.

నిందితుడు.. విజయ్ మామ జాదవ్ నందులాల్ ఇంద్రవెల్లి పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా.. నిందితుడు విజయ్ భార్య మహేశ్వరి టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరికి చెందిన 24 తులాల బంగారాన్ని‌ కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 9 లక్షలు తీసుకున్నాడు విజయ్. ఆ వచ్చిన డబ్బుతో ఆన్‌లైన్ జూదం ఆడిన నిందితుడు ఆ డబ్బులు పోవడంతో రైతుల డబ్బులను వినియోగించి బ్యాంకులోని మామ, భార్య పేరిట తాకట్టు‌లో ఉన్న బంగారాన్ని విడిపించాడు. నగలను బ్యాంకు నుంచి విడిపించుకోవటానికి రైతుల డబ్బులు వాడుకోవటం, ఈ అక్రమాల గురించి మామ నందులాల్, భార్య మహేశ్వరికి పూర్తి సమాచారం ఉన్నా… అడ్డు చెప్పకుండా విజయ్ కు సహకరించారని గుర్తించారు పోలీసులు. ఈ ఇద్దరిని సైతం కేసులో నిందితులుగా చేర్చారు. అయితే ఈ ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం.

పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు విజయ్ జాదవ్ వద్ద నుండి రైతుల డబ్బులను మాయం చేసేందుకు ఉపయోగించిన ల్యాప్‌టాప్, ఛార్జర్లు, మూడు సెల్ ఫోన్లు , ఆరు క్రెడిట్ కార్డులు, ఒక డైరీ, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే మేనేజర్ ను నమ్మి నిండా మునిగిన రైతులు మాత్రం అసలు ఈ డబ్బులు తిరిగొస్తాయో‌రావో అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Also read

Related posts

Share via