హైదరాబాద్ సిటీలో మదకద్రవ్యాల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కీలక వ్యక్తులను అరెస్టులు చేస్తున్నా.. గంజాయి, డ్రగ్స్ దందాకు చెక్ పడటం లేదు. నిన్న హైదరాబాద్ లోని వేర్వేరు ఘటనల్లో ఆరుగురు అరెస్ట్ అయ్యారంటే సప్లయ్ తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కిలోల కొద్ది గంజాతోపాటు డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి.
తాజాగా శుక్రవారం SOT మేడ్చల్ టీమ్ & మేడ్చల్ పోలీస్ సంయుక్తంగా మేడ్చల్ PS పరిధిలోని రేకులబావి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను పట్టుకుని బాగులను పరిశీలించారు. వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి, ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాలో నౌపాడా ప్రాంతం నుంచి 2 కేజీల గంజాయిని తీసుకొని హైదరాబాద్ కు వచ్చారు. పోలీసులు గస్తీ నిర్వహించగా దొరికిపోయారు. అంతేకాదు.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కేజీకి రూ.2,500/- చొప్పున కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది.
Also read
- RTA చలాన్ పేరుతో వచ్చిన లింక్ క్లిక్ చేసిన ఏపీ MLA.. కట్ చేస్తే..
- అపాయింట్మెంట్ లెటర్తో ఉద్యోగానికి వెళ్లి నిరుద్యోగులు.. అధికారుల రిఫ్లై విని షాక్!
- ఛీ.. ఛీ.. ఇదేం పని రా.. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులా..?
- శ్రీశైలంలో మహా అపచారం: గర్భగుడిలో మల్లికార్జున స్వామి వీడియో తీసిన భక్తుడు.. సోషల్ మీడియాలో వైరల్!
- Karimnagar SI : గన్నేరు పప్పు తిని భార్య మృతి.. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న SI





