హైదరాబాద్ సిటీలో మదకద్రవ్యాల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కీలక వ్యక్తులను అరెస్టులు చేస్తున్నా.. గంజాయి, డ్రగ్స్ దందాకు చెక్ పడటం లేదు. నిన్న హైదరాబాద్ లోని వేర్వేరు ఘటనల్లో ఆరుగురు అరెస్ట్ అయ్యారంటే సప్లయ్ తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కిలోల కొద్ది గంజాతోపాటు డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి.
తాజాగా శుక్రవారం SOT మేడ్చల్ టీమ్ & మేడ్చల్ పోలీస్ సంయుక్తంగా మేడ్చల్ PS పరిధిలోని రేకులబావి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను పట్టుకుని బాగులను పరిశీలించారు. వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి, ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాలో నౌపాడా ప్రాంతం నుంచి 2 కేజీల గంజాయిని తీసుకొని హైదరాబాద్ కు వచ్చారు. పోలీసులు గస్తీ నిర్వహించగా దొరికిపోయారు. అంతేకాదు.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కేజీకి రూ.2,500/- చొప్పున కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది.
Also read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- కలెక్టరేట్లో తీవ్ర విషాదం.. ఉన్నతాధికారి వేధింపులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగి బలి!
- తీరని విషాదం.. నాలుగు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసిన ఈత సరదా..!
- అబ్రకదబ్ర.. పేపర్ చదువుతుండగా మాయమైన స్కూటీ.. ఓర్నీ దుంపతెగ..
- దేవుడికి అరటిపండు, కొబ్బరికాయ ఎందుకో తెలుసా? – ఆ రహస్యం ఇదే!




