ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రం శివారులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మందగడ్డ అటవీ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి క్షుద్ర పూజలు జరిపారు. ఉదయానే అటువైపు పొలం పనులకు వెళ్లిన స్థానికులు అత్యంత భయంకరంగా నిర్వహించిన క్షుద్రపూజల ఆనవాళ్లు చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ములుగు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మందగడ్డ అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమతో భారీ రూపంలో మనిషి ఆకారంలో ముగ్గు వేసి అందులో రక్తార్పణం చేశారు. అంతేకాకుండా ముగ్గులో నాలుగు కాళ్ల జంతువులు బలి ఇచ్చిన ఆడవాళ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ క్షుద్రపూజలు ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.
అయితే ఆదివారం అర్ధరాత్రి ఈ పూజలు నిర్వహించినట్లు స్థానికులు భావిస్తున్నారు.. శత్రు పీడ వినాశనం కోసం చేశారా..! లేక ఎవరికైనా అనారోగ్య సమస్యల నుండి విముక్తి కోసం క్షుద్రపూజలు చేశారా. లేక ఎవరినైనా భయపెట్టించడం కోసం ఇలాంటి పూజలు చేశారో ఆర్థం కావట్లేదని స్థానికులు చెబుతున్నారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





