SGSTV NEWS
CrimeTelangana

సిద్దిపేట జిల్లాలో దారుణం.. కూల్ డ్రింక్ కోసం వచ్చి మహిళను చంపేసిన దుండగులు..! కారణం ఇదేనట..



సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన గాలి బాల్ లక్ష్మీ అనే మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..గ్రామంలో జరిగిన మర్డర్‌తో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హంతకుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..


మహిళను అత్యంత కిరాతకంగా చంపేశారు గుర్తు తెలియని దుండగులు..చంపేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో పాటు..ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు..సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన గాలి బాల్ లక్ష్మీ అనే మహిళల అత్యంత దారుణంగా ఈ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..వివరాల్లోకి వెళ్తే చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన గాలి బాలలక్ష్మి, సుధాకర్ దంపతులకు కుమారుడు వెంకటేశ్, కుమార్తె స్వాతి ఉన్నారు. పిల్లలకు వివాహాలు పూర్తయ్యాయి. కాగా బాల్ లక్ష్మీ ఇంట్లోనే ఉంటూ చిన్న కిరణం షాప్ నడిపిస్తుంది. బాల్ లక్ష్మీ భర్త సుధాకర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.


ఈ క్రమంలోనే మే 30న బాల్ లక్ష్మీ అత్యంత దారుణంగా హత్యకు గురైంది..ప్రతి రోజు లాగానే భర్త సుధాకర్ ఆటో తీసుకొని బయటకు వెళ్లగానే.. యధావిధిగా బాల్ లక్ష్మీ తన కిరాణా షాప్ లో ఉంది.. మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు దుకాణానికి వచ్చారు.. కూల్ డ్రింక్స్ కావాలని అడిగి  తీసుకున్నారు..వచ్చిన వారు కూల్ డ్రింగ్ తాగుతూ ఉండగా..బాల్ లక్ష్మి టీ పెట్టుకోవటానికి ఇంట్లోకి వెళ్లింది.. ఇదే అదునుగా భావించిన దుండగులు..ఇంట్లోకి చొరబడి బాల్ లక్ష్మి ఒంటి పై ఉన్న బంగారు ఆభరణాలు లాక్కొని, గొంతు కోసి ఆమెను హత్య చేసి అక్కడి నుండి పారిపోయారు..చాలా సేపటి నుండి బాల్ లక్ష్మి ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడడంతో బాల్ లక్ష్మి రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది..వెంటనే గ్రామస్థులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.

ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ శ్రీను, ఎస్ఐ బాలకృష్ణ, క్లూస్లీం సభ్యులు వచ్చి పరిశీలించారు.భర్త సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది..ఈ కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాలలో విచారిస్తున్నారు..బాల్ లక్ష్మీని చంపిన దుండగులు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..హత్యకు గురి అయిన బాల్ లక్ష్మి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్న అవి పనిచేయకపోవడంతో,కేసు జఠిలమయ్యే అవకాశం ఉంది.



ఈ హత్య చేసింది కమ్మర్లపల్లి గ్రామ శివారులో ప్రాజెక్టుల్లో పని చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల లేబర్, లేదంటే ఇదే గ్రామానికి చెందిన వారెవరైనా ఈ హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు..ఇక బాల్ లక్ష్మి మృతితో కమ్మర్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి..హత్య చేసిన నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలని బాలలక్ష్మీ కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు కూడా కోరుతున్నారు.

Also read

Related posts

Share this