February 23, 2025
SGSTV NEWS
CrimeTelangana

Sangareddy: లోన్ మాఫీ కోసం ఎంత పని చేశావ్‌రా.. సొంత బావనే…



ఇవి మంచి రోజులు కావు.. కుటుంబ బంధాలంటే విలువు లేవు. డబ్బే ప్రధానమైపోయింది. ఆ డబ్బు కోసం ఏం చేసేందుకు అయినా వెనకాడం లేదు. కొందరు అయితే ఏకంగా కుటుంబ సభ్యులనే మట్టుబెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే.. సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది…


ఇది మరో దారుణం..  బావను బామ్మర్ది చంపేసిన క్రైమ్‌ స్టోరీ ఇది..  బావ, బావమరిది.. ఇద్దరు కలిసి JCB వాహనం కొన్నారు  ఈ క్రమంలో బావమరిది మెదడులో దారుణమైన ఆలోచన తట్టింది. బావను చంపిస్తే.. వెహికల్‌పై ఉన్న లోన్ మాఫీ అవుతుందన్నదే అతని మైండ్‌లోకి వచ్చిన దారుణం. ఆలోచన వచ్చిందే తడువుగా స్నేహితుడుతో కలిసి ఆపరేషన్ చేపట్టాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ దారుణం. అమీన్‌పూర్‌లో నివాసముంటున్న బానోతు గోపాల్ నాయక్‌ను తన మిత్రునితో కలిసి హత్య చేసి మృతదేహాన్ని స్మశాన వాటికలో వదిలివెళ్లాడు నరేష్ నాయక్.


వీరిది మెదక్ జిల్లా పాపన్నపేట్‌గా పోలీసులు గుర్తించారు. బావ, బామ్మర్ది కలిసి JCB వాహనం కొనుగోలు చేశారని..  బావను హత్య చేస్తే అతని పేరుపై ఉన్న JCB లోన్‌ మాఫీ అవుతుందని హత్య చేసినట్లు పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారంలో తేలింది. దర్యాప్తు చేపట్టిన అమీన్‌పూర్ పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్య వెనుక ఉన్న పూర్తి మిస్టరీని చేధించే పనిలో ఉన్నారు పోలీసులు

Also read

Related posts

Share via