SGSTV NEWS
Andhra PradeshTelangana

పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్.. కారణం ఏంటంటే..

పవన్ ను అరెస్ట్ చేసి విచారణ చేయాలి. చట్టం ముందు అంతా సమానమే.



KA Paul : ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయన పవన్ పై కంప్లైంట్ ఇచ్చారు. ఇటీవల లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు పాల్. అంతేకాదు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం పదవికి అనర్హుడని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేఏ పాల్.


”40 ఏళ్ల నుంచి నేను ఎప్పుడూ పోలీస్ స్టేషన్ కి రాలేదు. ఒకటి రెండు సార్లు నేరుగా డీజీపీనే కలిశాను. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ని కలిసి పవన్ కల్యాణ్ మీద 14 సెక్షన్ల కింద కంప్లైంట్ ఇచ్చాను. ఆయన తిరుపతి లడ్డూ గురించి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశాను. లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని పవన్ చెప్పారు. అది పచ్చి అబద్ధం. ఇన్వెస్టిగేషన్ అయ్యిందే జూన్ లో. అయోధ్య ఓపెనింగ్ జనవరిలో. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.

హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. ముఖ్యంగా ఆయన హిందువులను కించపరిచారు. నా ఫిర్యాదులో 14 సెకన్లు పెట్టాను. ఆర్టికల్ 8 కింద పవన్ పై తక్షణమే అనర్హత వేటు వేయాలి. ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ రాజీనామా చేయాలి. పవన్ ను అరెస్ట్ చేసి విచారణ చేయాలి. చట్టం ముందు అంతా సమానమే. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా… చట్టానికి కట్టుబడి ఉండాలి.

నేను హైదరాబాద్ లోనే ఉంటున్నా ఏనాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు. 40 ఏళ్ల తర్వాత నేను ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు ఇచ్చాను. తక్షణమే పవన్ కల్యాణ్ నోరు మూయించాలి. పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఏవేవో మాట్లాడుతున్నారు. అవన్నీ రాంగ్. సినిమాలో మాదిరి నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అది చదివేస్తున్నావు. అది చట్ట విరుద్ధం.

రుజువులతో సహా నేను పవన్ పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాను. తక్షణమే నాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. 145 కోట్ల మంది భారతీయుల, ముఖ్యంగా 100 కోట్ల మంది హైందవుల మనోభావాలు దెబ్బతీశారు. తిరుపతిని, లడ్డూని అపవిత్రం చేశారు. ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ లేకుండా మిస్ లీడ్ చేశారు. నేను సనాతన ధర్మం అంటే నమ్ముతారని పవన్ ని అనుకుంటున్నారేమో. పవనే చెప్పారు నేను క్రిస్టియన్ ని, బాప్టిజం తీసుకున్నా అని. మొన్నే తన కూతురు క్రిస్టియన్ అని పవన్ కల్యాణ్ రిజిస్ట్రీ చేయించారు. సనాతన ధర్మం అయితే ఇవన్నీ విరుద్ధం కదా. స్వామి వివేకానందను మిస్ లీడ్ చేసేలా పవన్ కల్యాణ్ మాట్లాడారు. వెంటనే పవన్ కల్యాణ్ తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలి” అని కేఏ పాల్ డిమాండ్ చేశారు

వీడియో

Also read

Related posts

Share this