పేరుకే యూట్యూబర్.. కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరాతీస్తున్నాయి. పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్కి చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్లోనూ వెలుగుచూశాయి.
పేరుకే యూట్యూబర్.. కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరాతీస్తున్నాయి. పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్కి చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్లోనూ వెలుగుచూశాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని వర్చువల్గా హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఓ రేంజ్లో హడావిడి చేసింది జ్యోతి మల్హోత్రా. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది ఈ యూట్యూబర్. గూఢచర్యం కేసులో అరెస్ట్ తర్వాత జ్యోతి మల్హోత్రా అప్పటి వీడియోలు, ఫోటోలు సోషల్మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
జ్యోతి మల్హోత్రా హైదరాబాద్కి కేవలం వందేభారత్ రైలు ఓపెనింగ్ ప్రోగ్రాం కోసమే వచ్చిందా? లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా? వేరే వీడియోలు ఏమైనా తీసిందా? అప్పుడంటే యూట్యూబర్. కానీ ఇప్పుడే తెలిసింది తను మన శత్రుదేశంతో సమాచారం షేర్ చేసుకుంటోందని. అందుకే హైదరాబాద్లో అప్పట్లో ఆమె యాక్టివిటీపైన కూడా ఆరాతీస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కొన్నాళ్లక్రితం ఒడిశాలోని పూరీకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒడిశాకు చెందని మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో ఆమె చాలా క్లోజ్గా ఉంది. మరోవైపు పూరీజగన్నాథ్ ఆలయంపై ఉగ్రవాదులు కన్నేసినట్లు నిఘాసంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. మూడు నెలల క్రితమే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరీకి ట్రావెలర్గానే వచ్చిందా.. లేదంటే ఇంకేమన్నా కారణముందా అన్న యాంగిల్లోనూ సాగుతోంది పోలీసు ఎంక్వయిరీ.
హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పూరీకి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. జ్యోతితో పాటు పూరీ యూట్యూబర్ కూడా పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో ఒడిశా పోలీసులు, ఐబీ అధికారులు ఆ మహిళ గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు. అయితే ప్రియాంక సేనాపతి మాత్రం తనకు జ్యోతితో.. ఎలాంటి సంబంధం లేదని.. ఇద్దరం యూట్యూబర్లం మాత్రమేనంటోంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ప్రియాంక సేనాపతికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలలముందు జమ్ముకశ్మీర్లోని పహల్గామ్కి వెళ్లింది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. దీంతో ఆ టూరిస్ట్ ప్లేస్ సమాచారాన్ని తను ఎవరితోనైనా షేర్ చేసుకుందా అన్న డౌట్తో ఆ దిశగా కూడా ఎంక్వయిరీ చేస్తున్నాయి నిఘాసంస్థలు. పహల్గామ్దాడిని ఖండిస్తూ తర్వాత లైవ్ వీడియో చేసింది జ్యోతి మల్హోత్రా. ఆమె టూర్, రియాక్షన్ రెండూ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా.. తమ కూతురు ఢిల్లీకి వెళ్లి వస్తుండేదని, ఆమె పాకిస్తాన్కి వెళ్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ తెలిపారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!