ఛీ.. ఛీ.. అసలు వీళ్లు మనుషులేనా.. రానురానూ మనుషుల్లో మానవత్వం మంట గలిసిపోతోంది. తాజాగా ఇందుకు నిదర్శనంగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. అది చూస్తే మీరు కూడా మీకంటే జంతువులే బెటర్ అని అంటారు. ఆ స్టోరీ ఏంటంటే
కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే మనుషుల కంటే జంతువులే చాలా బెటర్ అని అనిపిస్తుంది. రానురానూ మనుషుల్లో మానవత్వం పూర్తిగా మంటగలిసిపోతుంది. కొందరు అయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. అందరూ అసహ్యించుకునే విధంగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న డివైడర్పై వదిలివెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. అభం శుభం తెలియని ఆ పసికందు అరుపులు విని పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు. రోజులు కూడా నిండని పసికందును ఇలా నడిరోడ్డుపై వదిలి వెళ్లిన దుర్మార్గులకు కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు స్థానికులు. మరోవైపు నవ మాసాలు మోసి జన్మనిచ్చిన ఆ పసికందు తల్లి కూడా దీనికి ఎలా ఒప్పుకుందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనుషుల కంటే, జంతువులే బెటర్ అని అనిపిస్తోంది.
Also read
- భార్యను తిట్టిన భర్త.. తననే దూషించాడని భావించి పక్కింటి మహిళ దాడి! ఆ తర్వాత సీన్ ఇదే..
- నీది ఫేక్ బంగారం అంటే నీది ఫేక్.. గోల్డ్ మాన్ ల మధ్య లొల్లి.. ఇంటిపై దాడి..
- నమ్మినవారే మోసం చేశారంటూ సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి… చివరికి ఏం జరిగిందంటే?
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు





