మోసం.. మోసం.. మోసం.. ఎటు చూసినా మోసం.. ఎక్కడ చూసినా మోసం.. సైబర్ క్రైమ్ మోసాల గురించి అవగాహనలు కల్పిస్తున్నా.. బాధితులు మోసపోతూనే ఉన్నారు. ఆన్లైన్ ప్రపంచంలో అడుగడుగునా చీటర్స్ ఉన్నారు.. జాగ్రత్త అని ఎన్ని సార్లు చెప్పినా.. ఎవ్వరూ వినిపించుకోవడం లేదు.. ఫలితంగా మోస చేయడం ఫ్రాడ్ గాళ్ల వంతయితే.. మోసపోవడం అమాయకుల వంతవుతోంది.. జాబ్స్ అంటూ.. కార్లు అంటూ.. లక్కీ డిప్.. అంటూ వచ్చే వాటిని అస్సలు నమ్మోద్దని.. వాటి గురించి తెలియకుండా డబ్బుల లావాదేవీలు నిర్వహించవద్దని పదే పదే సూచిస్తున్నా.. అత్యాశకు పోయి.. డబ్బులన్నీ గుల్ల చేసుకుంటున్నారు.. చివరకు పోలీసులను ఆశ్రయించి లబోదిబోమంటున్నారు.. తాజాగా.. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ రూ.3లక్షల వరకు మోసపోవడం కలకలం రేపింది.. ఆన్లైన్ స్కామ్లో సికింద్రాబాద్కు చెందిన 45 ఏళ్ల గృహిణి రూ.2.79 లక్షలు మోసపోయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్కు చెందిన మహిళ బిడ్డకు లాభదాయకమైన మోడలింగ్ అసైన్మెంట్లు ఇస్తామని సైబర్ నేరగాడు నమ్మించాడు.. పిల్లల ప్రతిభా పోటీలు అంటూ ఏవేవో మాయమాటలు చెప్పి.. ఆన్లైన్ స్కామ్తో డబ్బులు దండుకున్నాడు.. వివరాల ప్రకారం.. మే 12, 2025న ‘ఎరికా వాలీ’ అనే పేరుతో పనిచేస్తున్న ఒక యూజర్ బాధితురాలిని ఫేస్బుక్ ద్వారా సంప్రదించినప్పుడు ఈ స్కామ్ బయటపడింది. నిందితుడు హైదరాబాద్లో ‘కిడ్స్ టాలెంట్ మోడల్ కాంటెస్ట్ 2025’ నిర్వహిస్తున్న పిల్లల టాలెంట్ ఏజెన్సీ ‘వండర్ కిడ్జ్’లో రిసెప్షనిస్ట్ అని చెప్పుకున్నాడు.
“H&M, Ajio, Zara Kids, Mothercare, Kiddy Palace వంటి ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్లకు మోడలింగ్ అసైన్మెంట్ల కోసం పిల్లలను వెతుకుతున్నామని మోసగాడు ఆ మహిళను ఒప్పించాడు. అవకాశం నిజమైనదని నమ్మిన ఆ మహిళ.. అతను కోరినట్లుగా తన బిడ్డ వ్యక్తిగత వివరాలు.. ఫొటోలను పంచుకుంది” అని హైదరాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్ తెలిపింది.
వెంటనే, స్కామర్ ఆమెను టెలిగ్రామ్లో కమ్యూనికేషన్ కొనసాగించమని సూచించాడు.. షూట్ కోసం దుస్తులను ఆమె చిరునామాకు ఉచితంగా డెలివరీ చేయబడతాయని ఆమెకు హామీ ఇచ్చాడు. మోసగాడు పంపిన లింక్ ద్వారా ఆమెను టెలిగ్రామ్ గ్రూప్లో చేర్చారు.
ఆ మహిళను నమ్మించడానికి మూడు పనులు పూర్తి చేయాలని కోరాడు.. ఇందులో కొన్ని ఫేస్బుక్ పేజీలను లైక్ చేయడం, రుజువుగా స్క్రీన్షాట్లను సమర్పించడం లాంటివి ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసిన తర్వాత, ఆమెకు వ్యాపారి లింక్లను పంపాడు.. ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఆర్డర్లు ఇవ్వమని ఆదేశించాడు.. చెల్లించిన డబ్బు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుందని హామీ ఇచ్చారు.
ఈ ప్రక్రియను నమ్మిన బాధితురాలు రూ.5,000, రూ.18,000, రూ.58,000 చొప్పున మూడు చెల్లింపులు చేసింది. అనంతరం తప్పుడు క్యాప్చా ఇన్పుట్ కారణంగా సిస్టమ్ క్రాష్ జరిగిందని ఆమెకు తరువాత చెప్పారు. ఆమె ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి పొందడానికి రెండు వాయిదాలలో అదనంగా రూ.98,000 చెల్లించమని కోరింది. మోసం అక్కడితో ముగియలేదు.. ఆ మోసగాడు ఆమెను మరో రూ.1.69 లక్షలు చెల్లించమని బలవంతం చేశాడు.. అయినప్పటికీ ఆమె రెండు భాగాలుగా రూ.1 లక్ష మాత్రమే చెల్లించగలిగింది.
బాధితురాలు చివరికి తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు.. ఆమె పనులు సరిగ్గా పూర్తి చేయడంలో విఫలమయ్యిందని, మళ్ళీ సిస్టమ్ క్రాష్కు కారణమని ఆమెకు చెప్పారు.. అనంతరం సైబర్ క్రిమినల్స్ రెస్పాండ్ కాకపోవడంతో.. ఆమె మోసపోయిందని గ్రహించింది. ఆమె ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!