Hyderabad: వీరిని హైదరాబాద్లో ఉంచకుండా నైజీరియన్ దేశానికి డిపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు . ఇప్పటివరకు పదిమందికి పైగానే నైజీరియన్లను హైదరాబాద్ నుండి డిపోర్ట్ సైతం పోలీసులు చేశారు. దీంతో డిపోర్టేషన్కు భయపడుతున్న నైజీరియన్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మరోవైపు డిపోర్టేషన్ సందర్భంగా నిందితులకు..
హైదరాబాద్లో ఎక్కడ డ్రగ్స్ ముఠాలు పట్టుబడిన వారి మూలలు మాత్రం ఒక నైజీరియన్ వద్దనే ఉంటున్నాయి. ఇటీవల కాలంలో సుమారు 50 మందికి పైగా నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి ఉంటారు. అయితే ఎం డి పి ఎస్ చట్టాల లో ఉన్న లొసుగుల కారణంగా నిందితులకు యదేచ్చగా బెయిల్ వస్తుంది. దీంతో బయటికి వచ్చి మళ్లీ షరామామూలే ఆనట్టు నేరాలకు పాల్పడుతున్నారు.
దీంతో వీరిని హైదరాబాద్లో ఉంచకుండా నైజీరియన్ దేశానికి డిపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు . ఇప్పటివరకు పదిమందికి పైగానే నైజీరియన్లను హైదరాబాద్ నుండి డిపోర్ట్ సైతం పోలీసులు చేశారు. దీంతో డిపోర్టేషన్కు భయపడుతున్న నైజీరియన్లు కొత్త మార్గాలను అన్వేషించే హైదరాబాద్ వదిలి ఉండకుండ ఉండేలాగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇక్కడే ఒక యువతిని పెళ్లి చేసుకుని, ఆమె చేత హరాస్మెంట్ కేస్ పెట్టించి ఇక్కడి జైల్లోనే ఉండేలాగా చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో కేసులు ఉండటంతో వారి డిపోర్టేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది.
మరోవైపు డిపోర్టేషన్ సందర్భంగా నిందితులకు సంబంధించిన ఫ్లైట్ టికెట్లను సైతం హైదరాబాద్ పోలీసులే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భంలో మూడు లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు కూడా ఒక్కొక్క నైజీరియన్ కు టికెట్ బుక్ చేసి డిపోర్టేషన్ చేసిన దాఖాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు అన్వేషిస్తున్నారు
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..